G7 సదస్సులో భారత్ ఉనికి ఎలా కీలకం అయ్యింది?
భారత్ తో మొదలుకొని గ్లోబల్ సౌత్ లీడర్లను మెలోనీ G7కు ఆహ్వానించారు. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు అల్జీరియా, జీ20 చైర్ బ్రెజిల్, జోర్డాన్, కెన్యా, ఏయూ చైర్ మౌరిటానియా, ట్యునీషియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఆమె ఆహ్వానించారు..

G7 Summit: ఇటలీలోని అపులియాలో G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రముఖ నాయకులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొంటూ తర్డ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ముఖ్యమైన క్షణం. అయితే, పొరుగుదేశాలకు ప్రథమ ప్రాధాన్యం అనే విధానానికి అనుగుణంగా 2024, జూన్ 9వ తేదీ మోదీ 3.O ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాలను ఆహ్వానించడంతో దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
G7 సదస్సుకు భారత్ ను ఆహ్వానించడం ఇది 11వ సారి. మోడీకి ఆహ్వానం అందడం ఇది వరుసగా ఐదోసారి. ఈ సమావేశాలకు సాధారణ అతిథిగా మోడీ హాజరవుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మూడో సారి ప్రధానిగా ఎన్నికవడంతో ఇతర దేశాల సీనియర్ నేతల్లో ఒకరిగా మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశంలో కూడా వరుసగా మూడో సారి ప్రధాని, అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు లేడు. దీంతో మోడీ స్థానం మరింత బలంగా మారింది. మోడీని ఆహ్వానించిన ఇటలీ ప్రధాని గియోర్జియా మెలోనీ కూడా యూరోపియన్ ఎన్నికల్లో విజయంతో ఎగ్జయిటింట్ గా ఉంది. ఇది ఆమె మితవాద పార్టీని ఇటాలియన్ రాజకీయ విజయాల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లింది.
ఇతర G7 నాయకుల్లో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఇద్దరూ యూరోపియన్ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో బలమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా బతికే ఉన్నప్పటికీ సెప్టెంబర్ తర్వాత ఆయన కొనసాగడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఈయూ కమిషన్ నేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మరో సారి వచ్చే అవకాశం ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 2025, అక్టోబర్ లో ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు.
Tags:సంబంధిత వార్తలు
CALENDER - 07-10-2025 06:39:31 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|